పీఎం రిలీఫ్ ఫండ్‌కు ఒప్పో కోటి రూపాయల విరాళం

ABN , First Publish Date - 2020-03-30T00:14:21+05:30 IST

భారత్‌లో కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరులో చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో కూడా చేయి కలిపింది. ప్రధానమంత్రి

పీఎం రిలీఫ్ ఫండ్‌కు ఒప్పో కోటి రూపాయల విరాళం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరులో చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో కూడా చేయి కలిపింది. ప్రధానమంత్రి సహాయనిధి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా ఒప్పో మాట్లాడుతూ.. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ సేవలు కొనసాగిస్తున్న వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్టు పేర్కొంది. వారు పనిచేస్తున్న కారణంగానే తాము ఇంట్లో క్షేమంగా ఉండగలుగుతున్నామని, అత్యవసర సేవలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ క్రమంలో తమ వంతు సాయంగా పీఎం సహాయనిధి, యూపీ సీఎం సహాయనిధికి కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించినట్టు పేర్కొంది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ముందుండి పోరాడుతూ ప్రజలకు వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతాభావాన్ని చూపించడానికి ఇది చిన్న అడుగు మాత్రమేనని ఒప్పో పేర్కొంది.  

Updated Date - 2020-03-30T00:14:21+05:30 IST