ఆపరేషన్‌ హిడ్మా!

ABN , First Publish Date - 2021-10-19T08:05:47+05:30 IST

మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఏటూరునాగారం అడవుల్లో ప్రవేశించారనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఆపరేషన్‌ హిడ్మా!

  • ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్‌
  • ఆస్పత్రులు, ఆర్‌ఎంపీల ఇళ్ల వద్ద నిఘా

భూపాలపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఏటూరునాగారం అడవుల్లో ప్రవేశించారనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల పోలీసులు ముప్పేట దాడికి సిద్ధమయ్యారు. హిడ్మాపై విషప్రయోగం జరగ్గా.. వైద్యం కోసం తెలంగాణకు వచ్చాడని కొన్నివర్గాలు, ఆర్కే మృతికి కారణాలను ఆరా తీసేందు కు వచ్చాడని మరికొన్ని వర్గాలు చె బుతున్న విషయం తెలిసిందే. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి ఇంద్రావతినది పరీవాహక ప్రాంతం మీదగా భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోకి మావోయిస్టు బృందాలు ప్రవేశించాయనే ప్రచారం జరుగుతోంది. పలిమెల, మహాదేవపూర్‌, మహాముత్తారంతోపాటు.. ములుగు జిల్లా కన్నాయిగూడెం, తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపే ట అడవుల్లో హిడ్మా తలదాచుకునే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఎల్‌జీఏ నేత కావడంతో హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉం టుంది. అంటే.. కనీసం పాతిక మంది సాయుధులైన మావోయిస్టులు అతనికి కాపలాగా ఉంటారు. మరోవైపు హిడ్మా తన బృందంతో భూపాలపల్లి, ములుగు జిల్లా సమీపంలో గోదావరితీరం దాటి ఉండొచ్చనే అనుమానాలు పోలీసువర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మహదేవపూర్‌-ఏటూరునాగారం ఏరియా కమిటీ హిడ్మాకు ఆశ్రయం ఇచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లోని అడవి ప్రాంత ఆర్‌ఎంపీలు, పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెంచారు. ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లోనూ కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.


స్లో పాయిజనా?

మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్‌గా దళంలోని కొందరు వ్యక్తులు స్లోపాయిజన్‌ ప్రయోగం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే కూడా కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. తదనంతర లక్షణాలతోపాటు, తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డారని తెలుస్తోంది. విష ప్రయో గం మెల్లిమెల్లిగా శరీర భాగాలపై ప్రభావం చూపించిందని, ఊపిరితిత్తుల, మూత్రపిండాల సమస్యలకు అదే కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికీ మించి, ఉన్నఫళంగా నరాల బలహీనత సమస్య ఆర్కేను తీవ్రంగా వేధించిందని సమాచారం. హిడ్మాలో కూడా క్రమంగా ఇలాంటి లక్షణాలే బయటపడుతున్నాయని, నరాల సమస్య ప్రారంభమవ్వడంతో.. విషప్రయోగంపై అప్రమత్తమై చికిత్సకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

Updated Date - 2021-10-19T08:05:47+05:30 IST