జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-28T04:52:27+05:30 IST
జోగుళాంబ గ ద్వాల జిల్లాలో 71ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 1.90 మెట్రిక్ టన్నుల ఽధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
- వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్
వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, నవంబరు 27 : జోగుళాంబ గ ద్వాల జిల్లాలో 71ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 1.90 మెట్రిక్ టన్నుల ఽధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా ఉన్నతా ధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మా ట్లాడుతూ యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్ర త్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సా రించేలా కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వ ల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో టీమ్లను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. యాసంగి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకొనుటకు రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో ఎస్పీ రంజన్ రతన్కుమార్, అదనపు కలెక్టర్ రఘురామ్శ ర్మ, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, డీ ఎస్వో రేవతి, అధికారులు పాల్గొన్నారు.