మైలవరంలో Anna canteen ప్రారంభం
ABN , First Publish Date - 2022-07-16T19:42:29+05:30 IST
జిల్లాలోని మైలవరంలో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి క్యాంటిన్ను ప్రారంభించారు.
ఎన్టీఆర్: జిల్లాలోని మైలవరంలో అన్న క్యాంటీన్(Anna canteen) ప్రారంభమైంది. శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni umamaheshwar rao) తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి క్యాంటిన్ను ప్రారంభించారు. అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ(YCP) ప్రభుత్వం అన్న క్యాంటీన్లను తీసివేసి పేద వాళ్ళ పొట్ట కొట్టిందని మండిపడ్డారు. త్వరలోనే రాష్ట్రం అంతా అన్న క్యాంటీన్ లను తిరిగి ప్రారంభిస్తామన్నారు. టీడీపీ(TDP) పెడుతున్న అన్న క్యాంటీన్లను ఆపే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని తెలిపారు. అన్న క్యాంటీన్ స్థలంలో భారీగా ప్రభుత్వ మద్యం సీసాలు ఉన్నాయని, అన్నం పెట్టె స్థలాలను మద్యం తాగే వారికి కేరఫ్ అడ్రస్లుగా మార్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో కల్తీ మద్యం తాగి చనిపోవడంపై ప్రభుత్వం సిగ్గు పడాలని దేవినేని ఉమా అన్నారు. అన్న క్యాంటిన్ ప్రారంభానికి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.