ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు రద్దు.. అంతా పాస్‌

ABN , First Publish Date - 2020-09-23T09:43:14+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్స్‌ విధానంలో నిర్వహించాల్సిన టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దయ్యాయి.

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు రద్దు.. అంతా పాస్‌

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్స్‌ విధానంలో నిర్వహించాల్సిన టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దయ్యాయి. పరీక్ష ఫీజు చెల్లించి, అర్హత కలిగిన 1,68,717 మంది అభ్యాసకులు పాస్‌ అ య్యారు. ప్రిపరేటరీ పరీక్షల్లో ఆయా అభ్యాసకులు పొందిన మార్కుల ఆధారంగా పబ్లిక్‌ పరీక్షల్లో మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

Updated Date - 2020-09-23T09:43:14+05:30 IST