ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించండి
ABN , First Publish Date - 2021-05-14T06:03:30+05:30 IST
టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించాలని డీఈవో నరసింహారెడ్డి తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), మే 13: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు శుక్రవారం నుంచి తత్కాల్ ద్వారా పరీక్షల ఫీజు చెల్లించాలని డీఈవో నరసింహారెడ్డి, కో-ఆర్డినేటర్ వరప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరానికి టెన్త్ విద్యార్థులు తత్కాల్ ద్వారా అపరాధ రుసుం కింద రూ.500, ఇంటర్ విద్యార్థులు రూ.1000లతో ఈనెల 20వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.