ఐదు లీటర్ల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లే వాడాలి

ABN , First Publish Date - 2021-05-07T07:50:22+05:30 IST

కరోనా రోగిలో ప్రాణవాయువు స్థాయిని పెంచేందుకు కనీసం ఐదు లీటర్ల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వాడాలని ఐసీఈఏ తెలిపింది. ఇటీవల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వాడకం విస్తృతంగా జరుగుతోంది...

ఐదు లీటర్ల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లే వాడాలి

న్యూఢిల్లీ, మే 6: కరోనా రోగిలో ప్రాణవాయువు స్థాయిని పెంచేందుకు కనీసం ఐదు లీటర్ల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వాడాలని ఐసీఈఏ తెలిపింది.  ఇటీవల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వాడకం విస్తృతంగా జరుగుతోంది. అయితే వాటిలో ఏ విధమైనవి కొవిడ్‌ రోగులకు సరిపోతాయి అనే దానిపై చాలామందికి స్పష్టత లేదు. ఈ కీలక తరుణంలో ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అసోసియేషణ్‌ (ఐసీఈఏ) పలు ఉపయోగకరమైన సిఫారసులు చేసింది. 15-19 కేజీల సామర్థ్యం కలిగి, కనీసం నిమిషానికి 5లీటర్ల ప్రాణవాయువును సరఫరా చేయగలిగే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కొవిడ్‌ రోగులకు వినియోగించాలని సూచించింది.

Updated Date - 2021-05-07T07:50:22+05:30 IST