ఏడేళ్లలో ఒకే ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్: షర్మిల
ABN , First Publish Date - 2021-11-25T09:11:26+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్ల పాలనలో వేసింది ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్ మాత్రమేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్ల పాలనలో వేసింది ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్ మాత్రమేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్కు ఉద్యోగాల భర్తీపై ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని విమర్శించారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు పుంఖానుపుంఖాలుగా టెండర్లు జారీ అవుతున్నాయని, ఉద్యోగాల భర్తీపై మాత్రం పెదవి విప్పడం లేదని ట్విట్టర్ వేదికగా ఆమె ఆరోపించారు. నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా దొరగారికి సోయి రావడం లేదని మండిపడ్డారు.