ఒక పాజిటివ్.. 1847 మందికి టీకా
ABN , First Publish Date - 2021-01-19T05:10:30+05:30 IST
జిల్లాలో సోమవారం కరోనా పాజిటివ్ కేసు ఒక్కటే ఒక్కటి నమోదైంది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 63,828కు చేరింది.
నెల్లూరు(వైద్యం), జనవరి 18 : జిల్లాలో సోమవారం కరోనా పాజిటివ్ కేసు ఒక్కటే ఒక్కటి నమోదైంది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 63,828కు చేరింది. తాజాగా ఎలాంటి మరణాలు సంభవించ లేదు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నారాయణ ఆసుపత్రితోపాటు కొవిడ్ కేర్ సెంటర్లలో కరోనా నుంచి కోలుకున్న 49 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్ చేశారు. కాగా, కరోనా నియంత్రణ టీకా కార్యక్రమం సోమవారం ఊపందుకుంది. 16వతేదీ వ్యాక్సినేషన్ ప్రారంభంకాగా తొలిరోజు 1342 మంది, రెండో రోజు 1320 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. సోమవారం మూడో రోజు మాత్రం 1847 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు టీకా వేయించుకున్న వారిలో ఎటువంటి దుష్ఫలితాలు లేకపోవడంతో వైద్యాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.