ఒక్క ఛాన్స్ అని బతిమాలితే అధికారం ఇచ్చారు: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-10-22T01:29:59+05:30 IST
ఒక్క ఛాన్స్ అని బతిమాలితే జగన్కు అధికారం ఇచ్చారని, పదే పదే తప్పుడు పనులు చేస్తూ చివరి ఛాన్స్గా చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు.
అమరావతి: ఒక్క ఛాన్స్ అని బతిమాలితే జగన్కు అధికారం ఇచ్చారని, పదే పదే తప్పుడు పనులు చేస్తూ చివరి ఛాన్స్గా చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఉన్న 30 జిల్లాల్లో.. 5 జిల్లాలు ఏపీలోనే ఉండటం బాధాకరమన్నారు. కరోనాలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉండటం శోచనీయమని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, పేదలు, చేతివృత్తుల వారు ఆర్ధికంగా చితికిపోయారని, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను వైసీపీ విస్మరించిందని తప్పుబట్టారు. దోపిడీ చేయడమే జగన్మోహన్రెడ్డి ఏకైక మార్గమని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి గండికొట్టే పార్టీని ఎప్పుడైనా చూశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధానిని 3 ముక్కలు చేయడం రాష్ట్రానికి ఎంతో నష్టమన్నారు. రివర్స్ పాలనతో రాష్ట్రాభివృద్దిని అంతా రివర్స్ చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలు, చేసేవన్నీ తప్పుడు పనులని తప్పుబట్టారు. ఇంతగా బరి తెగించిన పార్టీని ఎక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు.