Online Rummyలో నష్టపోయిన భర్త..ఆత్మహత్య చేసుకున్న భార్య

ABN , First Publish Date - 2022-09-26T17:00:47+05:30 IST

ఆన్‌లైన్‌ రమ్మీ(online rummy) కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పల్లావరం సమీపం పమ్మల్‌ ప్రాంతంలో జ్ఞానసెల్వన్‌, వహిదా ఫ్లోరా (30) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు

Online Rummyలో నష్టపోయిన భర్త..ఆత్మహత్య చేసుకున్న భార్య

చెన్నై: ఆన్‌లైన్‌ రమ్మీ(online rummy) కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పల్లావరం సమీపం పమ్మల్‌ ప్రాంతంలో జ్ఞానసెల్వన్‌, వహిదా ఫ్లోరా (30) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. జ్ఞానసెల్వన్‌ ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ వేలాది రూపాయలు నష్టపోయాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు అధికమయ్యాయి. శనివారం రాత్రి ఈ విషయంలో ఇద్దరి మద్య తగాదా జరిగింది. ఆన్‌లైన్‌ రమ్మీ ఆడొద్దని భర్తకు వహిదా ఫ్లోరా ఎంతగా మొత్తుకున్నా పట్టించుకోలేదు. దీంతో  ఆమె ఓ గదిలోకి వెళ్ళి గడియపెట్టుకుని ఫ్యాన్‌కు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది.  సమాచారం అందుకున్న శంకర్‌నగర్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు.

Updated Date - 2022-09-26T17:00:47+05:30 IST