హిందువుల సంతతి పెరగకుండా.. ఆన్లైన్ ఆర్డర్ ఫుడ్లో కెమికల్స్: రాజాసింగ్
ABN , First Publish Date - 2020-02-20T10:05:22+05:30 IST
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల సంతతి పెరగకుండా ఆన్లైన్ ఆర్డర్ ఫుడ్లో కెమికల్స్ కలిపి పంపిస్తున్నారని,
తాండూరు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల సంతతి పెరగకుండా ఆన్లైన్ ఆర్డర్ ఫుడ్లో కెమికల్స్ కలిపి పంపిస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ హిందువులపై దాడులు జరుపుతున్నారని, టెర్రరిస్టులు తయారవుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి హిందూ యువకుడు ఒక ఛత్రపతి శివాజీ కావాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్రలో రాజాసింగ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. చార్మినార్, తాజ్మహల్ను తామే కట్టామంటూ ఒవైసీ గొప్పలు చెప్పారని, 800 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ల తాతల పేర్లు చెప్పగలరా? అని ప్రశ్నించారు.