ఆన్లైన్ తరగతులపై ఓయూ ప్రకటన
ABN , First Publish Date - 2022-01-16T20:23:25+05:30 IST
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రేపటినుంచి ఈ నెల 30వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటి నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రేపటినుంచి ఈ నెల 30వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యూనివర్సిటీల పరిధిలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడంతో పరీక్షలు రీషెడ్యూల్ విడుదల చేశారు. ఎల్లుండి నుంచి పలు యూనివర్సిటీలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు.
మరోవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించినట్లు వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 8 నుంచి నేటి వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.