విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-25T05:19:10+05:30 IST

విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో

జిల్లా విద్యాధికారి ప్రణీత

పెంబి, నవంబరు 24 : కరోనా నేపథ్యంలో విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులను ప్రవేశ పెట్టిందని, ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రణీత అన్నారు. సోమవారం మండలంలోని పెంబి, మందపల్లి గ్రామా ల్లో పర్యటిస్తూ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఆన్‌లైన్‌ తరగతులను వింటూ ఏవైనా సందేహలు న్నట్లయితే వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు ప్రతి రోజు విద్యా ర్థుల ఆన్‌లైన్‌ తర గతులను పరిశీలించాలన్నారు. ఆమె వెంట ఉపాధ్యాయులు విజేందర్‌, వెంకటరాములు, రవీందర్‌, సీఆర్‌పీ విఠల్‌, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-11-25T05:19:10+05:30 IST