ఫైనల్లో భారత్‌

ABN , First Publish Date - 2020-10-25T09:01:06+05:30 IST

గ్రాండ్‌మాస్టర్లు అధిబన్‌, వైశాలి సత్తా చాటడంతో భారత పురుష, మహిళా జట్లు ఆసియా నేషన్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్

ఫైనల్లో భారత్‌

ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: గ్రాండ్‌మాస్టర్లు అధిబన్‌, వైశాలి సత్తా చాటడంతో భారత పురుష, మహిళా జట్లు ఆసియా నేషన్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో ప్రవేశించాయి. సెమీ్‌సలోని రెండు అంచెల్లో టాప్‌ బోర్డులపై ఆడిన ఈ ఇరువురు జీఎమ్‌లు అద్భుత విజయాలు సాధించారు. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో పురుషుల జట్టు తొలి రౌండ్లో 2.5-1.5, రెండో రౌండ్లో 3-1తో కజకిస్థాన్‌పై నెగ్గింది. మహిళా జట్టు తొలి రౌండ్లో 3.5-0.5, రెండో రౌండ్లో 4-0తో మంగోలియాపై గెలుపొంది ఫైనల్‌ బెర్త్‌ను సొంతం చేసుకొంది. ఇక, ఆదివారం జరగనున్న టైటిల్‌ పోరులో సూర్యశేఖర్‌ గంగూలీ నేతృత్వంలోని భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాతో, మేరీ గోమ్స్‌ సారథ్యంలోని మహిళా జట్టు ఇండోనేసియాతో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Updated Date - 2020-10-25T09:01:06+05:30 IST