రేపటి నుంచి 3,830 పంచాయతీల్లో ఆన్‌లైన్‌ ఆడిట్‌

ABN , First Publish Date - 2020-08-02T12:11:42+05:30 IST

రేపటి నుంచి 3,830 పంచాయతీల్లో ఆన్‌లైన్‌ ఆడిట్‌

రేపటి నుంచి 3,830 పంచాయతీల్లో ఆన్‌లైన్‌ ఆడిట్‌

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలు వినియోగించిన నిధులపై ఆన్‌లైన్‌ ఆడిట్‌ జరగనుంది. తొలి విడతలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియ.. అక్టోబరు ఆఖరి వరకూ కొనసాగనుంది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకుగాను 3,830 (30ు) పంచాయతీల్లో ఆన్‌లైన్‌ ఆడిట్‌ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 336 మంది ఆడిటర్లను నియమించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం ఆన్‌లైన్‌ ఆడిట్‌ తప్పని సరి అని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.  

Updated Date - 2020-08-02T12:11:42+05:30 IST