ఒంగోలులో కలకలం.. ఐసోలేషన్ నుంచి వ్యక్తి పరారీ..

ABN , First Publish Date - 2020-04-03T19:42:42+05:30 IST

ప్రకాశం జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి పరారయ్యాడు.

ఒంగోలులో కలకలం.. ఐసోలేషన్ నుంచి వ్యక్తి పరారీ..

ఒంగోలు : ప్రకాశం జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనతో ఒంగోలులో కలకలం రేగింది. అయితే ఆయన ఎక్కడికెళ్లాడు..? ఏమయ్యాడు..? అని అధికారులు గాలిస్తున్నారు. ఆయనకు కరోనా లక్షణాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫోన్‌ చేసినప్పటికీ కలవట్లేదని.. స్విచాఫ్‌ అని వస్తున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. మరోవైపు పోలీసులు సైతం ఆయనకోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.


కాగా.. గత కొన్ని రోజుల క్రితం కూడా ఇదే రిమ్స్ ఆస్పత్రి నుంచి కరోనా లక్షణాలున్నా ఓ వ్యక్తి పారిపోయేందుకు యత్నించాడు. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది ఆయన్ను పట్టుకుని మళ్లీ వార్డుకు తరలించింది. అయితే ఆయనే తాజాగా పారిపోయాడా..? లేకుంటే మరో వ్యక్తా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-04-03T19:42:42+05:30 IST