ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్గా భాగ్యలక్ష్మి
ABN , First Publish Date - 2020-10-27T18:06:56+05:30 IST
ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా కె. భాగ్య లక్ష్మి నియమితులయ్యా రు. ఇప్పటి వరకూ ఇక్క డ పనిచేస్తున్న పి. నిరం జన్రెడ్డి..
నిరంజన్రెడ్డి బదిలీ
ఒంగోలు: ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా కె. భాగ్య లక్ష్మి నియమితులయ్యా రు. ఇప్పటి వరకూ ఇక్క డ పనిచేస్తున్న పి. నిరం జన్రెడ్డి బదిలీ అయ్యా రు. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. నూతన కమిషనర్గా నియమితులైన భాగ్యలక్ష్మి ప్రస్తుతం గుంటూరులో అసిస్టెంట్ కమిషనర్గా పని చేస్తున్నారు. గతంలో రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీలలో గ్రేడ్-1 కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆమె స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్గా ఉద్యోగోన్నతి పొందారు. బదిలీ అ యిన నిరంజన్రెడ్డి గత ఏడాది జూలై 17న ఒంగోలు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. పదహారు నెలలు పనిచేశారు. అతి తక్కువ సమయం లోనే బదిలీ కావడం చర్చనీయంశంగా మారింది. ఆయన్ను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.