కొనసాగుతోన్న ఆర్ఎస్ఎస్ సమావేశాలు

ABN , First Publish Date - 2022-01-05T23:57:49+05:30 IST

నగరంలోని అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు

కొనసాగుతోన్న ఆర్ఎస్ఎస్  సమావేశాలు

హైదరాబాద్: నగరంలోని అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు కొనసాగుతోన్నాయి. సంఘ్ ఏర్పడి వందేళ్ళు అయిన సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేవాలకు 36 సంస్థలకు చెందిన  216మంది ప్రతినిధులు హాజరయ్యారు.  విద్య, ఆర్థిక రంగం, సేవా, సామాజిక రంగాలపై పనిచేసే స్వయం సేవకులతో సంఘ్ సమన్వయం కొనసాగుతోన్నది. పర్యావరణం, కుటుంబ విలువలు, సామాజిక సమరసత వంటి అంశాలపై సమన్వయంతో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలమే దానిపై చర్చిస్తున్నారు. గతేడాది చర్చించిన ఉపాధి కల్పనపై సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా ప్రణాళికపై చర్చ. ఏబీవీపీ చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. కోవిడ్ సమయంలో సేవ భారతి సహా.. వివిధ సంస్థలు చేసిన సేవా కార్యక్రమాల పై చర్చించారు. విద్య రంగంలో జరుగుతున్న కార్యక్రమాలు  వాటిపై చర్చించారు. వివిధ సంఘ్ క్షేత్రాల్లో పనిచేస్తోన్న వారి అనుభవాలను, ఆలోచనలను ప్రతినిధులు పంచుకుంటున్నారు.  

Updated Date - 2022-01-05T23:57:49+05:30 IST