కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు
ABN , First Publish Date - 2022-01-20T04:11:43+05:30 IST
కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు
తాండూరు : తాండూరు పట్టణం ఇందిరాచౌక్ నుంచి రైల్వేస్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో రోడ్డుకిరువైపులా నష్టపోతున్న భవన యజమానులు పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని అధికారులు కోరారు. కాగా, ఈ రోడ్డు మార్గంలో దాదాపు 94భవనాలు పాక్షికంగా నష్టపోనున్నాయి. ఆర్అండ్బీ మున్సిపల్ అధికారులు సంయుక్తంగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. రోడ్డు విస్తరణలో దుకాణదారులు పాక్షికంగా నష్టపోతుండటంతో ప్రభుత్వం దాదాపు రూ.3కోట్ల పరిహారం చెల్లించనుంది. అలాగే రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న వారికి రూ.3కోట్ల50లక్షల వరకు పరిహారం చెల్లించనుంది. రోడ్డు విస్తరణలో సుమారు వెయ్యి గజాల వరకు యజమానులు స్థలం కోల్పోనున్నారు. అదేవిధంగా ఒక గజం(స్క్వేర్ యార్డ్) చొప్పున పరిహారం చెల్లించనున్నారు. కాగా, ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్రెడ్డి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి త్వరలో పూర్తిచేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.