కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్‌ నిరసన దీక్షలు

ABN , First Publish Date - 2022-08-07T05:09:43+05:30 IST

కుప్పంలో ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో ఎమ్మెస్పీ, ఎమ్మార్పీఎస్‌ల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు 12వ రోజైన శనివారంనాడు కూడా కొనసాగాయి.

కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్‌ నిరసన దీక్షలు
కుప్పంలో నిరసన దీక్షలు చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

కుప్పం, ఆగస్టు 6: కుప్పంలో ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో ఎమ్మెస్పీ, ఎమ్మార్పీఎస్‌ల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు 12వ రోజైన శనివారంనాడు కూడా కొనసాగాయి. స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట నిరసన దీక్ష శిబిరంలో పాల్గొన్న నాయకులు ప్రకాశ్‌, దేవరాజ్‌, రాజ్‌కుమార్‌ తదితరులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయకుండా పండట్‌ దీనదయాళ్‌ సిద్ధాంతాలను సైతం బీజేపీ తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. వర్గీకరణ విషయంలో మాదిగలకు బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. ఒక్కరూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఖర్చుకాని వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ నాయకులు రవీంద్ర, మురుగేశ్‌, ఈశ్వర్‌, సంపత్‌, సరస్వతి, నందిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T05:09:43+05:30 IST