నిరుద్యోగులకు కొనసాగుతున్న ఉచిత కోచింగ్
ABN , First Publish Date - 2022-05-27T05:19:17+05:30 IST
నిరుద్యోగులకు కొనసాగుతున్న ఉచిత కోచింగ్
షాద్నగర్ రూరల్, మే 26: షాద్నగర్లో నిరుద్యోగులు, ఉద్యోగార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ గురువారంతో 65రోజులు పూర్తిచేసుకుంది. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్న క్రమంలో యువతకు కోచింగ్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే అంజయ్య సబ్జెక్ట్ స్పెషలిస్టులతో ఠాగూర్ పాఠశాలలో ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నారు. మొదట వెయ్యి మంది పేర్లు నమోదు చేసుకోగా ప్రస్తుతం 600మందికి పైగానే రోజూ కోచింగ్ సెంటర్లో తరగ తులకు హాజరవున్నారు. విద్యార్థులకు రోజూ మధ్యాహ్నం భోజనాన్ని అందిస్తున్నారు. ఎమ్మెల్యే కూడా యువతీ యు వకులతో కలిసి అప్పుడప్పుడు భోజనం చేస్తున్నారు.