కొనసాగుతున్న ఎంసెట్‌

ABN , First Publish Date - 2020-09-24T08:21:37+05:30 IST

ఏపీ ఎంసెట్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 2897 మంది విద్యార్థులు హాజరైనట్లు

కొనసాగుతున్న ఎంసెట్‌

జేఎన్టీయూకే, సెప్టెంబరు 23: ఏపీ ఎంసెట్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 2897 మంది విద్యార్థులు హాజరైనట్లు కన్వీనర్‌ వి.రవీంద్ర తెలిపారు. మొత్తం 89 శాతం మంది పరీక్షలు రాశారన్నారు. బుధవారం ఉదయం నిర్వహించిన ఇంజనీరింగ్‌ పరీక్షకు 1508 మంది, మధ్యాహ్నం నిర్వహించిన అగ్రికల్చర్‌ మెడికల్‌ ప్రవేశ పరీక్షకు 1389 మంది హాజరయ్యారన్నారు. ఇంజనీరింగ్‌ పరీక్షలు ముగియగా అగ్రికల్చర్‌ మెడికల్‌ పరీక్షలు మొదలయ్యాయని ఈ నెల 25 వరకు కొనసాగుతాయని కన్వీనర్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-24T08:21:37+05:30 IST