ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ, ఆంక్షలు

ABN , First Publish Date - 2021-06-20T17:18:41+05:30 IST

ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతోంది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ, ఆంక్షలు

అమరావతి: తెలంగాణ సరిహద్దుల్లో అర్ధరాత్రి నుంచి  ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో వాహనాలకు ఆటంకాలు తొలగిపోయాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఆంక్షలు అమల్లో ఉన్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అయితే కర్ఫ్యూ సమయంలో ఈ-పాస్ ఉంటేనే ఆంధ్రాలోకి అనుమతి ఇస్తామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - 2021-06-20T17:18:41+05:30 IST