విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-01-05T22:39:22+05:30 IST
జిల్లాలోని కొత్తవలసలో కరోనా కలకలం
విజయనగరం: జిల్లాలోని కొత్తవలసలో కరోనా కలకలం కొనసాగుతోంది. జిల్లా పరిషత్ హైస్కూల్లో మరో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది. నిన్న ఒక టీచర్, 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బాధితులను వైద్య సిబ్బంది హోం ఐసోలోషన్కి పంపారు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళన చెందుతున్నారు.