20 రోజుల్లో సాగునీరు ఇస్తాం

ABN , First Publish Date - 2020-11-01T11:15:17+05:30 IST

20 రోజుల్లో కాలువల పనులు పూర్తిచేసి నీరు ఇస్తామని జలవనరుల శాఖ ఎస్‌ఈ రెడ్డయ్య తెలిపారు. శనివారం సాయం త్రం కంభం చెరువు, పంట కాలువలు, అలుగును ఆయన పరిశీలించారు.

20 రోజుల్లో సాగునీరు ఇస్తాం

కంభం, అక్టోబరు 31: 20 రోజుల్లో కాలువల పనులు పూర్తిచేసి నీరు ఇస్తామని జలవనరుల శాఖ ఎస్‌ఈ రెడ్డయ్య తెలిపారు. శనివారం సాయం త్రం కంభం చెరువు, పంట కాలువలు, అలుగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట కాలువల మరమ్మతులకు మొదటి విడతగా పంచాయతీ గ్రాంటు కింద రూ.25 లక్షలు, జడ్పీ నిధులు రూ.25 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో  సోమవారం నుం చి పనులు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. 20 రోజుల్లో రైతులకు సాగునీరు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట డీఈ వెంకటేశ్వర్లు, జేఈ రామారావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-11-01T11:15:17+05:30 IST