నీలం సాహ్నికి కలెక్టర్ స్వాగతం
ABN , First Publish Date - 2020-10-31T09:23:56+05:30 IST
స్థానిక వెలిగొండ ప్రాజెక్టు విశ్రాంత భవనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు.
పెద్ద దోర్నాల, అక్టోబరు 30 : స్థానిక వెలిగొండ ప్రాజెక్టు విశ్రాంత భవనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. సీఎస్ నీలం సాహ్ని కుటుంబ సభ్యులతో శుక్రవారం కర్నూలు జిల్లా బైర్లూటి అటవీ ప్రాంతం సందర్శించేందుకు వెళుతూ దోర్నాలలోని వెలిగొండ గెస్ట్ హౌస్లో కొద్ది సేపు బస చేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆమెకు స్వాగతం పలికారు. మధ్యాహ్న సమ యం కావడంతో అక్కడే భోజనం చేసిన అనంతరం బైర్లూటి వెళ్లారు. కార్యక్రమంలో ఆర్డీవో శేషిరెడ్డి, తహసీల్దారు ఉమారాణి, డిప్యూటీ డీఎఫ్వో వినీత్కుమార్, రేంజి అధికారి సునీల్కుమార్ పాల్గొన్నారు.