రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం
ABN , First Publish Date - 2020-10-29T10:28:58+05:30 IST
రైతులను ప్రభుత్వం అన్ని విదాలా భరోసా కల్పిస్తోందని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
దర్శి, అక్టోబరు 28 : రైతులను ప్రభుత్వం అన్ని విదాలా భరోసా కల్పిస్తోందని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. కృషి విజ్ఞానకేంద్రంలో బుధవారం ఆర్బీకే, డీఆర్సీల ఆధ్వర్యంలో వ్యవసాయ సహయకులకు ఏర్పాటు చేసి న శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రైతులు విత్తనం కొనుగోలు చేసే సమయం నుంచి పంటను విక్రయించుకునే సమయం వరకు రైతుభరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల సహకారం అం దిస్తామన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాణకేంద్రం పోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, డీఆర్సీ ఏపీడీ అన్నపూర్ణ, దర్శి ఏడిఏ అర్జున్నాయక్, సబ్ డివిజన్ పరిదిలోని వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులు, వీఏఏలు పాల్గొన్నారు. ప్ర కాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన వ్యవసాయ పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. కృషి విజ్ఞానకేంద్రంలో బుధవారం కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన పరికరాల ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు.