విద్యతోనే ప్రగతి
ABN , First Publish Date - 2020-10-28T09:54:07+05:30 IST
విద్యతోనే ప్రగతి సాధ్యమవుతుందని అసోం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆరీజ్అహ్మద్ అన్నారు. అక్షరా స్యత పెంపులో వలంటీర్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
అసోం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరీజ్అహ్మద్
పొదిలి, అక్టోబరు 27: విద్యతోనే ప్రగతి సాధ్యమవుతుందని అసోం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆరీజ్అహ్మద్ అన్నారు. అక్షరా స్యత పెంపులో వలంటీర్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వగ్రామమైన పొదిలికి వచ్చిన ఆయన స్థానిక పంచాయతీ కార్యాలయంలో మంగళ వారం గ్రామ వలంటీర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు, వలంటీర్ల వ్యవస్థ పనితీరుపై ఆరా తీశారు. ఈ సం దర్భంగా వారికి పలు సూచనలు చేశారు. తమకు కేటాయించిన 50 కుటుం బాల వారికి విద్యపై అవగాహన కల్పించాలని సూచించారు. తమ లాల్ఫౌండేషన్ ద్వారా పొదిలి ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకృష్ణ, ఈవోఆర్డీ రాజశేఖర్, పంచాయతీ ఈవో బ్రహ్మనాయుడు, సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.