అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ABN , First Publish Date - 2020-10-28T09:55:14+05:30 IST
అనుమానాస్పద స్థితిలో మంగళవారం జిల్లాకు చెందిన మహిళ మృతి చెందింది.
వరంగల్ అర్బన్ క్రైం, అక్టోబరు 27: అనుమానాస్పద స్థితిలో మంగళవారం జిల్లాకు చెందిన మహిళ మృతి చెందింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం హన్మ కొండలోని ప్రకాశ్రెడి ్డపేటలో చోటుచేసుకొంది. సుబేదారి సీఐ అజయ్ కుమార్ వివరాల ప్రకారం.. పొన్నలూరు మండ లం మాలెపాడు గ్రామానికి చెందిన అబ్రహం కుమార్తె మేలంగి అన్నమ్మ (22)ను మూడేళ్ల క్రితం చెరుకూరుకు చెందిన తాపీమేస్త్రీ పంది రవికి ఇచ్చి వివాహం చేశాడు.
రవి ఉపాధి కోసం 2018 భార్యతో కలిసి హన్మకొండకు వచ్చి ప్రకాశ్రెడ్డిపేటలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. సోమవారం రవి పనికి వెళ్ల గా అన్నమ్మ ఇంటి సమీపంలో ఉన్న మరుగు దొడ్డిలో పడి మృతి చెంది ఉంది. ఇరుగుపొరుగు చూసి రవికి ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.
ఈ విషయాన్ని రవి తమ్ముడు సుదర్శన్ వెంటనే అన్నమ్మ కుటుంబ సభ్యులకు తెలిపాడు. సాయంత్రం అన్నమ్మ మృతదేహాన్ని ఎంజీఎం మా ర్చురీకి తరలించారు. అన్నమ్మ మృతిపై అను మానం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి అబ్రహం సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.