నీ వెంటే నేనూ..!

ABN , First Publish Date - 2020-09-29T11:25:44+05:30 IST

సత్యనారాయణ వ్యాయోమాపాధ్యాయుడిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. విజయలక్ష్మి కొంతకాలం ఇంకొల్లు ఎంపీపీగా ప్రాతినిథ్యం వహించారు. గత కొంతకాలంగా సత్యనారాయణ అనారోగ్యంతో ఉన్నారు. మంచానికే పరిమితమైన ఆయనకు భార్య విజయలక్ష్మి అన్నీ తానై సేవలందించింది. ఇటీవల ఆమె కూడా అస్వస్థతకు గురైంది.

నీ వెంటే నేనూ..!

అనారోగ్యంతో భర్త మృతి 

రెండు గంటల వ్యవధిలోనే తనువు చాలించిన భార్య

ఇంకొల్లులో విషాదం 

ఇంకొల్లు, సెప్టెంబరు 28 :సత్యనారాయణ వ్యాయోమాపాధ్యాయుడిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. విజయలక్ష్మి కొంతకాలం ఇంకొల్లు ఎంపీపీగా ప్రాతినిథ్యం వహించారు. గత కొంతకాలంగా సత్యనారాయణ అనారోగ్యంతో ఉన్నారు. మంచానికే పరిమితమైన ఆయనకు భార్య విజయలక్ష్మి అన్నీ తానై సేవలందించింది. ఇటీవల ఆమె కూడా అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సత్యనారాయణ మృతి చెందాడు.


విషయం తెలుసుకున్న విజయలక్ష్మి కుమిలిపోయింది. రెండు గంటల వ్యవధిలో రాత్రి 2.30 గంటల సమయంలో ఆమె కూడా తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పలువురు ప్రముఖులు భార్యాభర్తల మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. సోమవారం ఉదయం స్వగ్రామంలో వీరి అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక అమ్మాయి వైద్యురాలుగా పనిచేస్తున్నారు.

Updated Date - 2020-09-29T11:25:44+05:30 IST