అరాచక పాలనపై రాజీలేని పోరాటం
ABN , First Publish Date - 2020-09-29T11:17:34+05:30 IST
వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన, రైతు వ్యతిరేక విధా నా లపై రాజీలేని పోరాటం చేస్తానని బాపట్ల లోక్ సభ నియోజక వర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.
టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తాం
ఎమ్మెల్యే ఏలూరి
మార్టూరు/పర్చూరు, సెప్టెంబరు 28 : వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన, రైతు వ్యతిరేక విధా నా లపై రాజీలేని పోరాటం చేస్తానని బాపట్ల లోక్ సభ నియోజక వర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సోమవారం మండలం లోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయానికి వ చ్చిన ఆనను అభినందించేందుకు నియోజకవర్గం లోని నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఎ మ్మెల్యేకు పూలమాలలు, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ అటు ప్ర భుత్వ అరాచక పాలనపై పోరా డుతూనే ఇటు టీడీపీ పూర్వవైభవానికి శక్తి వంచన లేకుండా శ్రమి స్తానని తెలిపారు. మీ పోరాటానికి తామంతా అం డగా ఉంటా మని నాయకులు, కార్య కర్తలు ప్రక టించారు. ప్రభు త్వ వ్యతి రేక విధానాలపై ఆయ నను అభినందించడానికి వచ్చిన వా రిలో నాయ కులు వీరగంధం ఆంజనేయులు, గుంజి వెంకట రావు, రావిపాటి సీతయ్య, ఉప్పల పాటి చక్రపాణి, మక్కెన శేఖర్, తొండెపు ఆదినారా యణ, బ్రహ్మా రెడ్డి, సుందరరావు ఉన్నారు.