కుటుంబ కలహాలతో ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-02-20T09:53:37+05:30 IST
భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు భర్త ప్రాణాలను తీసింది. ఈ ఘటన
దొరతోపుకాలని (నెల్లూరురూరల్), ఫిబ్రవరి 19: భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు భర్త ప్రాణాలను తీసింది. ఈ ఘటన నెల్లూరురూరల్ మండలం నవలాకులతోట దొరతోపుకాలనీలో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. దొరతోపుకాలనీలో నివాసం ఉంటున్న అంబుర శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరు ఓ రైతు పొలంలో వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసవుతున్న భర్తను భార్య లక్ష్మి మందలించేది. ఈ క్రమంలో కొద్ది రోజులు భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చింది. అయినప్పటికీ భర్త పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఇరువురి మధ్య కలహాలు ఏర్పడ్డాయి. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాసులు మంగళవారం పురుగు మందు తాగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని నెల్లూరులోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.