వన్‌టైం సెటిల్‌మెంట్‌పై దృష్టి

ABN , First Publish Date - 2021-10-29T02:43:50+05:30 IST

అన్నిశాఖల అధికారులు హౌసింగ్‌ వన్‌టైం సెటిల్‌మెంట్‌పై దృష్టి సారించాలని కావలి డివిజన్‌ హౌసింగ్‌ ఈఈ నరసింహం తెలిపారు.

వన్‌టైం సెటిల్‌మెంట్‌పై దృష్టి
హౌసింగ్‌ రికార్డులు పరిశీలిస్తున్న ఈఈ నరసింహం

ఉదయగిరి, అక్టోబరు 28: అన్నిశాఖల అధికారులు హౌసింగ్‌ వన్‌టైం సెటిల్‌మెంట్‌పై దృష్టి సారించాలని కావలి డివిజన్‌  హౌసింగ్‌ ఈఈ నరసింహం తెలిపారు. గురువారం ఉదయగిరి స్త్రీశక్తి భవనంలో సచివాలయాల వలంటీర్లు, వర్కుఇన్‌స్పెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఇంజనీరింగ్‌, డిజిటల్‌  అసిస్టెంటకు  జగనన్న సంపూర్ణ గృహకల్ప పధకంపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాసులు, ఏఈ రామకృష్ణారావు, ఇన్‌చార్జి ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T02:43:50+05:30 IST