ఆటో బోల్తా - ఒకరికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-10-20T04:19:24+05:30 IST
మండలంలోని గుడిగుంట పంచాయతీ పరిధిలోని ఎగువపల్లి వద్ద 565 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
అనంతసాగరం, అక్టోబరు 19: మండలంలోని గుడిగుంట పంచాయతీ పరిధిలోని ఎగువపల్లి వద్ద 565 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మండల ంలోని పడమటికంభంపాడుకు చెందిన ఎన్. చెంచురెడ్డి మర్రిపాడు మండలం చుంచులూరు నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈప్రమాదం జరిగింది. స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.