మొన్న భార్య... నేడు భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-29T06:01:42+05:30 IST
కుటుంబ కలహాలతో మన స్థాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
తణుకు, జనవరి 28: కుటుంబ కలహాలతో మన స్థాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బ్యాంకు కాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. తణుకు పట్టణానికి చెందిన కొల్లి వెంక టేష్ (26) తాను ఉంటున్న ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య లక్ష్మి తులసి ఆత్మహత్య చేసుకున్నది. అప్పటి నుంచి తీవ్ర ఆవేదనతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వెంకటేష్ స్టేషన్ రోడ్డులోని కార్ వాష్ సర్వీసింగ్ సెంటర్ నిర్వహి స్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తమ్ముడు భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ గంగాధరరావు చెప్పారు