కావలి కాలువలో యువకుడు గల్లంతు

ABN , First Publish Date - 2022-05-23T05:01:25+05:30 IST

మండలంలోని కావలి కాలువలో నెల్లూరుకు చెందిన ఒక యువకుడు ఆదివారం సాయంత్రం గల్లంతయ్యాడు.

కావలి కాలువలో యువకుడు గల్లంతు
మాధవ్‌ ( ఫైల్‌)

సంగం, మే 22: మండలంలోని కావలి కాలువలో నెల్లూరుకు చెందిన  ఒక యువకుడు ఆదివారం సాయంత్రం గల్లంతయ్యాడు.  వివరాల మేరకు నెల్లూరు వేదాయపాళెంలో నివాసం ఉంటున్న సంగటి మాధవ్‌ (33)కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను నెల్లూరులో ఓ ఆటో ఫైనాన్స్‌ సంస్థలో కలెక్షన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆ సంస్థలో ఆటోకు ఫైనాన్స్‌ తీసుకున్న వ్యక్తి వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో ఆటో రికవరీకి సంస్థలో పనిచేసే మరో ముగ్గురు యువకులతో కలసి మాధవ్‌ ఆదివారం సంగం వచ్చారు. బుచ్చిరెడ్డిపాలెంలో మద్యం  కొనుగోలు చేశారు. సంగం సమీపంలో కావలి కాలువ వద్ద కారు ఆపి  నలుగురూ మద్యం సేవించారు. ఈ క్రమంలో మాధవ్‌ బహిర్భూమికి వెళ్లి శుభ్రం చేసుకునేందుకు కాలువ వద్దకు వెళ్లగా జారి గల్లంతైయాడు.  తోటి యువకులు గమనించారు. కానీ వారికి ఈత రాకపోవడంతో అతడిని కాపాడాలని సమీపంలో ఉన్న లారీ డ్రైవర్లను ప్రాథేయపడ్డారు. వారు తాడు వేసినా అందుకోలేక గల్లంతైయాడు. సమాచారం అందుకున్న బుచ్చి సర్కిల్‌ సీఐ కోటేశ్వరరావు, సంగం పోలీసులు సంఘటనా ప్రదేశానికి  వచ్చి ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు, ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. దీంతో సీఐ సెక్షన్‌ అధికారికి పోన్‌ చేసి కావలి కాలువకు నీటి సరఫరాను తగ్గించాలన్నారు. తగ్గాక గాలించనున్నారు. గల్లంతైన యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

Updated Date - 2022-05-23T05:01:25+05:30 IST