గార్గేయ నదిలో యువకుడి గల్లంతు
ABN , First Publish Date - 2020-11-29T06:14:02+05:30 IST
నివర్ తుఫాను కారణంగా ఐరాల మండలంలో గార్గేయి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని చవటపల్లె వద్ద వాగు ఉధృతికి గుర్తుతెలియని ఓ యవకుడు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ శుక్రవారం రాత్రి గల్లంతయ్యాడని గ్రామస్తులు అంటున్నారు.
ఐరాల, నవంబరు 28: నివర్ తుఫాను కారణంగా ఐరాల మండలంలో గార్గేయి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని చవటపల్లె వద్ద వాగు ఉధృతికి గుర్తుతెలియని ఓ యవకుడు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ శుక్రవారం రాత్రి గల్లంతయ్యాడని గ్రామస్తులు అంటున్నారు. శనివారం ఉదయం చిత్తూరు నుంచి విచ్చేసి రెస్క్యూ టీమ్ వాగులో గాలించినా ఫలితం లేదు. కాగా పూతలపట్టు మండలానికి చెందిన ఓ యువకుడికి ఆదివారం పుట్టిన రోజు ఉండటంతో ఐరాలలో తన స్నేహితుడిని కలవడానికి వచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం ఆ యువకుడు కనిపించకపోవడంతో అతడే అయి ఉండచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పూతలపట్టు ఎమ్మెస్.బాబు, ఆర్డీవో రేణుక, సీఐ లక్ష్మీకాంత్రెడ్డి పరిశీలించారు.