రెండ్రోజులుగా బావి నుంచి తీవ్ర దుర్వాసన.. అందులో యువతి శవాన్ని చూసి షాకైన స్థానికులు.. స్థానికంగా కలకలం సృష్టించిన ఘటన

ABN , First Publish Date - 2022-02-22T00:12:58+05:30 IST

రెండు రోజులుగా బావి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ వాసనకు గల కారణాన్ని తెలుసుకునే క్రమంలో ఆదివారం రోజు బావిలో యువతి శవాన్ని గుర్తించారు. అనంతరం

రెండ్రోజులుగా బావి నుంచి తీవ్ర దుర్వాసన.. అందులో యువతి శవాన్ని చూసి షాకైన స్థానికులు.. స్థానికంగా కలకలం సృష్టించిన ఘటన

ఇంటర్నెట్ డెస్క్: రెండు రోజులుగా బావి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ వాసనకు గల కారణాన్ని తెలుసుకునే క్రమంలో ఆదివారం రోజు బావిలో యువతి శవాన్ని గుర్తించారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ప్రయాగ్‌రాజ్‌లోని పోలోగ్రౌండ్‌ వద్ద ఉన్న బావి నుంచి రెండు రోజులుగా తీవ్ర దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే ఆ వాసనకు గల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరకు బావిలో యువతి శవాన్ని గుర్తించి అక్కడి ప్రజలు కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీయించారు. తర్వాత శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ఆ యువతి ఢిల్లీకి చెందిన రాజేంద్ర ప్రసాద్ కూతురు షాలినిగా గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కూతురు మరణ వార్త తెలిసి, హుటాహుటిన ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. ఫిబ్రవరి 13 రాత్రి నుంచి షాలిని కనబడకుండా పోయినట్టు పోలీసులకు వెల్లడించారు. 



అప్పటి నుంచి ఆమె జాడ కోసం వెతుకుతున్నట్టు పేర్కొన్నారు. షాలిని ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చినట్టు చెప్పారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. షాలిని ఓ యువకుడిని ప్రేమించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రియుడితో ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకునేందుకే ఢిల్లీ నుంచి ఆమె ప్రయాగ్‌రాజ్ వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను ఎవరో హత్యచేసి బావిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. షాలిని మృతదేహాన్ని బావిలో ఎవరు పడేసి ఉంటారనే కోణంలో విచారణ జరుపుతున్న అధికారులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే బావిలో యువతి మృతదేహం లభించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.




Updated Date - 2022-02-22T00:12:58+05:30 IST