రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2022-06-27T04:38:14+05:30 IST
మండలంలోని తిక్కవరప్పాడు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు.
వెంకటాచలం, జూన్ 26: మండలంలోని తిక్కవరప్పాడు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. నెల్లూరు బాలాజీనగర్కు చెందిన పులగర యోహాన్ (52) ఇస్కపాళెంలోని బంధువుల ఇంటికి మోటార్సైకిల్పై వెళుతున్నాడు. తిక్కవరప్పాడు వద్దకు వచ్చే సరికి అదుపుతప్పి రోడ్డు పక్కన నడిచి వెళుతున్న కూలీలను ఢీకొట్టాడు. మోటార్సైకిల్ బోల్తా పడి యోహాన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో కూలీ రాజుకి గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108లో నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివనాంచరయ్య తెలిపారు.