జంపన్నవాగులో ఒకరి మృతి.. మృతుడు ఘట్కేసర్‌ వాసి

ABN , First Publish Date - 2020-07-15T15:31:47+05:30 IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్నవాగు వరద నీటిలో మునిగి ఒకరు మృతిచెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. తాడ్వాయి ఎస్సై జి.రవీందర్‌ తెలిపిన వివరాల

జంపన్నవాగులో ఒకరి మృతి.. మృతుడు ఘట్కేసర్‌ వాసి

మేడారం(ఆంధ్రజ్యోతి) : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్నవాగు వరద నీటిలో మునిగి ఒకరు మృతిచెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. తాడ్వాయి ఎస్సై  జి.రవీందర్‌ తెలిపిన వివరాల మేరకు.. ఘట్కేసర్‌ మండలం శివారెడ్డి గూడకు చెందిన సుదర్శన్‌రెడ్డి (50) పది మంది స్నేహితులతో కలిసి మేడారం వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చాడు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవ శాత్తు వరద నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-07-15T15:31:47+05:30 IST