కల్వర్టును ఢీకొన్న బైకు యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-04-03T11:18:02+05:30 IST

బైక్‌ అదుపుతప్పి కింద పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపి

కల్వర్టును ఢీకొన్న బైకు యువకుడి మృతి

ఖమ్మం రూరల్‌, ఏప్రిల్‌ 2: బైక్‌ అదుపుతప్పి కింద పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం చర్చికాంపౌండ్‌కు చెందిన ఎస్‌కె.అర్షద్‌పాషా(23), బీటెక్‌ పూర్తిచేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బైకుపై ఇంటికి బయల్దేరాడు. ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లి వద్దకురాగానే బైకు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అర్షద్‌పాషాకు తీవ్రగాయాలు కాగా స్తానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-04-03T11:18:02+05:30 IST