గాడ్సే దేవుడు.. గాంధీ చెత్త కుప్ప: సాధువు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-28T22:12:01+05:30 IST

గాంధీ మోసగాడు, హిందూ వ్యతిరేకి. వాస్తవానికి గాంధీ ముస్లిం కానీ హిందూలోకి రహస్యంగా మారారు. గాంధీ, నెహ్రూలు చేసిన ద్రోహం వల్ల ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులకు తమ ఇల్లు ఇదే అని చెప్పుకోలేకపోతున్నారు. నేను గాంధీని చెత్త కుప్పతో పోలుస్తాను..

గాడ్సే దేవుడు.. గాంధీ చెత్త కుప్ప: సాధువు సంచలన వ్యాఖ్యలు

డెహ్రడూన్: మహాత్మా గాంధీపై మరొక సాధువు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌కి చెందిన కళాచరణ్ అనే సాధువు గాంధీని చంపింనందుకు గాడ్సేకు ధన్యావాదాలు తెలుపుతూ తీవ్ర విమర్శలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపివేస్తోంది. కాగా, ఉత్తరాఖండ్‌కి చెందిన మరో సాధువుకు సంబంధించిన వీడియో తాజాగా హల్‌చల్ నెట్టింట్లో హల్ చేస్తోంది. గాంధీని చెత్త కుప్పతో పోల్చుతూ గాడ్సేని దేవుడు అంటూ యతి నర్సింగానంద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. అంతే కాకుండా మహాభారతంలోని కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ మైనారిటీ మతస్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా, దీనిపై యతి నర్సింగానంద్ స్పందిస్తూ తన వ్యాఖ్యలు తప్పైతే తనను ఉరితీయండని, దానిని తాను త్యాగంలా భావిస్తానని మంగళవారం ఓ వీడియో సందేశం ద్వారా పేర్కొన్నారు.


దీనికి ముందు హరిద్వార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో యతి నర్సింగానంద్ మాట్లాడుతూ ‘‘గాంధీ మోసగాడు, హిందూ వ్యతిరేకి. వాస్తవానికి గాంధీ ముస్లిం కానీ హిందూలోకి రహస్యంగా మారారు. గాంధీ, నెహ్రూలు చేసిన ద్రోహం వల్ల ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులకు తమ ఇల్లు ఇదే అని చెప్పుకోలేకపోతున్నారు. నేను గాంధీని చెత్త కుప్పతో పోలుస్తాను. నా దృష్టిలో గాడ్సే దేవుడు’’ అని వ్యాఖ్యానించారు. ఇక ముస్లింల గురించి మాట్లాడుతూ ‘‘భగవద్గీతో పాండవులకు శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం మనం గుర్తుంచుకోవాలి. కౌరవులను చంపడానికి పాండవులను శ్రీకృష్ణుడు ప్రోత్సహించారు. ఇప్పుడు దీని గురించి అడిగితే కృష్ణుడు కూడా ధ్వేషపూరిత ప్రసంగం చేశాడంటారు. అయితే, తమ ప్రాంతాన్ని, తమ ప్రజలను కాపాడుకోవడానికే కృష్ణుడు అలా చెప్పాడని మనం అర్థం చేసుకోవాలి’’ అని యతి నర్సింగానంద్ అన్నారు.


దీనిపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో ఆయన తన వ్యాఖ్యలకు సమాధానం చెప్పుకొచ్చారు. ‘‘నేను ఎవరికీ వ్యతిరేకంగా ద్వేష ప్రసంగాలు చేయలేదు. ఇందులో మీరు ఒక్క వాఖ్యమైనా ద్వేషపూరితంగా ఉన్నట్లు గుర్తిస్తే నన్ను ఉరితీయండి. నేను అందరి మౌలానాల గురించి ప్రస్తావించాను. నన్ను కలిసి నాతో డిబేట్ చేయండి. అయినా నేను తప్పని నిరూపిస్తే మీరు నా తల నరికేయాల్సిన అవసరం లేదు. మాకు మేమే ప్రాణాలు తీసుకుంటాం. ఒకవేళ మమ్మల్ని హతమార్చినా మేం దానిని త్యాగంగా భావిస్తాం’’ అని యతి నర్సింగానంద్ సమాధానం ఇచ్చుకున్నారు.

Updated Date - 2021-12-28T22:12:01+05:30 IST