చోరీయత్నం.....జనం దాడిలో దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-18T06:24:50+05:30 IST

ఓ ఇంటిలో చోరీయత్నానికి పాల్పడబోయిన 30 ఏళ్ల వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన తిరుపతి జిల్లా గూడూరులో చోటుచేసుకుంది

చోరీయత్నం.....జనం దాడిలో దుర్మరణం
చోరీకి వచ్చి చనిపోయిన వ్యక్తి

గూడూరు, మే 17: ఓ ఇంటిలో చోరీయత్నానికి పాల్పడబోయిన 30 ఏళ్ల వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన తిరుపతి జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.... మంగళవారం రాత్రి గూడూరు పట్టణ పరిధిలోని తిలక్‌నగర్‌ ప్రాంతంలో నివాసముంటున్న రవి తన ఇంటి ముందు ఆరుబయట నిద్రిస్తున్నాడు. కుక్కల అరుపులు విని రవి నిద్రలేవగా సమీపంలో ఒక వ్యక్తి చోరీ యత్నానికి పాల్పడుతున్నట్లు గుర్తించాడు.కేకలు వేస్తూ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు తిరగబడి దాడికి పాల్పడ్డాడు.ఈలోపు అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఆ వ్యక్తిని పట్టుకుని కట్టేసి దేహశుద్ధి చేసి రెండోపట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గాయాలపాలైన ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మంగళవారం ఉదయంం మృతి చెందాడు.మృతుడు ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.ఎస్‌ఐ తిరుపతయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-18T06:24:50+05:30 IST