కాలుష్యం వెదజల్లుతున్న కాంట్రాక్టరుకు జరిమానా

ABN , First Publish Date - 2020-10-25T12:31:27+05:30 IST

చెత్తను దహనం చేసి కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కాంట్రాక్టరుకు ....

కాలుష్యం వెదజల్లుతున్న కాంట్రాక్టరుకు జరిమానా

నోయిడా : చెత్తను దహనం చేసి కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కాంట్రాక్టరుకు నోయిడా మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీ రూ.1.21లక్షల జరిమానా విధించింది. కాలుష్య నిబంధనలను ఉల్లంఘించిన ఏజీ ఎన్విరో అనే ప్రైవేటు కాంట్రాక్టరు చెత్తను దహనం చేసి కాలుష్యాన్ని వెదజల్లాడు.దీంతో నోయిడా అథారిటీ కాంట్రాక్టరుకు రూ.1.21 లక్షల జరిమానా విధించింది. నోయిడాలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో నోయిడా అధికారులు జరిమానాలు విధిస్తూ దీన్ని నివారించాలని నిర్ణయించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కాలుష్యం నివారణకు నోయిడా అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. కాలుష్యం నివారించేందుకు  రూ.32.15 లక్షల జరిమానాలు విధించామని అధికారులు చెప్పారు. డ్రైనేజీ కాల్వలను శుభ్రం చేయడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు 103కిలోమీటర్ల దూరం రోడ్లపై నీరు వెదజల్లారు.

Updated Date - 2020-10-25T12:31:27+05:30 IST