రూ.లక్ష విరాళం
ABN , First Publish Date - 2021-06-18T05:09:45+05:30 IST
కొవిడ్ విపత్తును ఎదుర్కోవడానికి ఏపీ రిటైర్డు గెజిటెడ్ పోలీసు అధికారుల అసోసియేషన్ గురువారం రూ.లక్ష విరాళం అందించింది.
కర్నూలు, జూన్ 17: కొవిడ్ విపత్తును ఎదుర్కోవడానికి ఏపీ రిటైర్డు గెజిటెడ్ పోలీసు అధికారుల అసోసియేషన్ గురువారం రూ.లక్ష విరాళం అందించింది. ఈ విరాళాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పకు అందజేశారు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీలు వెంకటరమణారెడ్డి, ఎం.షరీఫ్, కె.శంకరయ్య, రిటైర్డు డీఎస్పీలు ఆర్.కృష్ణమూర్తి, ఎ.దేవదానం, పాపరావు పాల్గొన్నారు.