ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-07-01T05:49:13+05:30 IST
ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో గింజేరు గ్రామానికి చెంది న వ్యక్తి మృతిచెందాడు.
గంట్యాడ: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో గింజేరు గ్రామానికి చెంది న వ్యక్తి మృతిచెందాడు. గంట్యాడ ఎస్ఐ కిల్లారి కిరణ్కుమార్నాయుడు అందించి న వివరాలు ఇలా ఉన్నాయి. గింజేరు గ్రామానికి చెందిన కె.రాము(45) గురువా రం ఉదయం తన ఆటోను బాగుచేయించే నిమిత్తం కొండతామారాపల్లి కూడలిలో వెల్డింగ్ షాపునకు వెళ్లాడు. వెల్డింగ్ షాపు తెరవకపోవడంతో తిరిగి ఆటోతో గ్రామానికి వస్తుండగా, ఎస్.కోట నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంతో రాము కింది పడిపోయాడు. ఆయన తలపై నుంచి బస్సు టైర్ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తు న్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.