రోడ్డు ప్రమాదాల్లో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-01-25T06:24:25+05:30 IST
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్లులోని శ్రీరేణుకా ఎల్లమ్మ, ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాల ఈవో బి.శ్రీనివాస్ ఆదివారం తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రం సూరత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
మరొకరికి గాయాలు
నల్లగొండ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
మాడ్గులపల్లి, జనవరి 24: మండలంలోని పెద్దదేవులపల్లి గ్రా మానికి చెందిన మాజీ సర్పంచ్ సింగం సైదులు(45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం సైదులు చెరువు దగ్గరికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ వస్తుండగా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెంకు చెందిన ఖాసిం ఢీకొట్టాడు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన సైదులును హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. సైదులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఖాసింను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైదులు అన్న వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కేతేపల్లి: కేతేపల్లికి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కేతేపల్లికి చెందిన గండమళ్ళ బాలస్వామి నకిరేకల్ వైపు నుంచి టీవీఎస్ మోపెడ్పై కేతేపల్లికి వస్తూ స్థానిక డీపౌల్ పాఠశాల వద్ద జాతీయ రహదారి దాటుతుండగా. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన బాలస్వామిని 108 అంబులెన్సులో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నెంబరును పోలీసులకు స్థానికులు అందజేశారు.
సూరత్లో రోడ్డు ప్రమాదంలో ఆలయ ఈవో ..
నల్లగొండ, కల్చరల్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్లులోని శ్రీరేణుకా ఎల్లమ్మ, ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాల ఈవో బి.శ్రీనివాస్ ఆదివారం తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రం సూరత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శ్రీనివాస్ స్నేహితులతో కలిసి సూరత్కు విహారయాత్రకు వెళ్లారు. మార్గమధ్యంలో జ్రరిగిన కారు ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడి క్కడే మృతి చెందగా, కొందరు గాయపడ్డారు. ఆయన స్వస్థలం యాద్రాద్రి జిల్లా భవనగిరి. శ్రీనివాస్కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.