రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-01-24T07:10:37+05:30 IST

మండలంలోని శీబా యి గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదంలో కర్నూ లు జిల్లా కనకాంబరపల్లికి చెందిన మహబూబ్‌బా షా (44) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కళ్యాణదుర్గం, జనవరి 23: మండలంలోని శీబా యి గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదంలో  కర్నూ లు జిల్లా కనకాంబరపల్లికి చెందిన మహబూబ్‌బా షా (44) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. మహుబూబ్‌బాషా ట్రాక్టర్‌లో నల్లబండలు వేసుకుని క ళ్యాణదుర్గం వైపు వస్తుండగా శీబాయి వద్ద సిమెంట్‌ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్‌లో  కూర్చున్న మహబూబ్‌బాషా కిందకు పడడంతో ట్రాక్టర్‌ అతనిపై వెళ్లి గాయపడ్డాడు. బాధితున్ని అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


రైలు కింద పడి..

డీ హీరేహాళ్‌, జనవరి 23 : మండలంలోని కల్యం గ్రామ స మీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమా దంలో రాయదుర్గానికి చెందిన వాల్మీకి పాండు (46) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. పాండు కొత్తూరు రైల్వే గేటు వద్ద ట్రాక్‌ దా టుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


బైకు అదుపుతప్పి ఎస్‌ఐకు స్వల్పగాయాలు 

బెళుగుప్ప, జనవరి 23: మండలంలోని అంకంపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఎస్‌ఐ శ్రీనివాస్‌ కు స్వల్ప గాయాలయ్యాయి. వి ధి నిర్వహణలో భాగంగా ద్విచ క్ర వాహనంలో కోనంపల్లి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు అ దుపుతప్పి పడటంతో కాలికి గాయాలయ్యాయి. బాధితు న్ని 108 అంబులెన్సలో ఆసుపత్రికి తరలించారు. 


ఎద్దుల బండిని ఢీకొన్న కారు

గుంతకల్లు టౌన, జనవరి 23: మండలంలోని నక్కనదొడ్డి గ్రామం వద్ద శనివారం రాత్రి ఎద్దులబండిని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో గొల్ల వెంకటేశ గాయపడ్డాడు. పొలంలో ఉన్న స్ర్పింక్లర్లు తేవడానికి గొల్ల వెంకటేశ ఎద్దులబండిలో బయలుదేరాడు. అనంతపురం నుం చి వస్తున్న కారు ఎద్దుల బండిని వెనుక నుంచి ఢీకొట్టిం ది. ప్రమాదంలో ఎద్దులబండి బోల్తా పడి గొల్ల వెంకటే ష్‌ గాయపడగా, గుంతకల్లులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-01-24T07:10:37+05:30 IST