Delhiలో ఏసీ కంప్రెషర్ పేలుడు...ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-04-15T12:41:42+05:30 IST

వేసవికాలంలో ఏసీ కంప్రెషర్ పేలిన దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది....

Delhiలో ఏసీ కంప్రెషర్ పేలుడు...ఒకరి మృతి

ఐదుగురికి గాయాలు

న్యూఢిల్లీ: వేసవికాలంలో ఏసీ కంప్రెషర్ పేలిన దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది.ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్ లోని ఓ తినుబండారాల దుకాణంలో ఎయిర్ కండీషనర్ కంప్రెషర్ ఒక్కసారిగా పేలింది. రెండు అంతస్తుల భవనంలో కంప్రెషర్ పేలడంతో ఏసీ మెకానిక్ లు నదీమ్, తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఈ దుర్ఘటనలో షాన్‌, డానిష్, అజ్జు, బిజయ్, ఇక్రాలు గాయపడ్డారు. వారిని  చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో చేర్చారు.కంప్రెషర్ పేలడంతో మంటలు చెలరేగాయి. మూడు అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను ఆర్పామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.


Updated Date - 2022-04-15T12:41:42+05:30 IST