Delhiలో ఏసీ కంప్రెషర్ పేలుడు...ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-04-15T12:41:42+05:30 IST
వేసవికాలంలో ఏసీ కంప్రెషర్ పేలిన దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది....
ఐదుగురికి గాయాలు
న్యూఢిల్లీ: వేసవికాలంలో ఏసీ కంప్రెషర్ పేలిన దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది.ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్ లోని ఓ తినుబండారాల దుకాణంలో ఎయిర్ కండీషనర్ కంప్రెషర్ ఒక్కసారిగా పేలింది. రెండు అంతస్తుల భవనంలో కంప్రెషర్ పేలడంతో ఏసీ మెకానిక్ లు నదీమ్, తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఈ దుర్ఘటనలో షాన్, డానిష్, అజ్జు, బిజయ్, ఇక్రాలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో చేర్చారు.కంప్రెషర్ పేలడంతో మంటలు చెలరేగాయి. మూడు అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను ఆర్పామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.